గత కొన్ని రోజులు గా సైలెంట్ గా ఉన్న వివాదాస్పద వ్యాఖ్యల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇవాళ (శనివారం) మరో బాండ్ పేల్చారు. గత కొన్ని రోజుల నుండి ప్రెస్ ముందుకు రాకుండా ట్విట్టర్ ద్వారా కామెంట్ చేస్తున్న వర్మ నేడు మీడియా ముందుకు వచ్చి మరో సంచలనాత్మక ప్రాజెక్టు పేరు ప్రకటించారు.
వర్మ గత కొన్ని రోజుల నుండి ఫ్యాక్షనిస్టుల మీద, మర్డర్ ల మీద సినిమాలు తీస్తూ నిత్యం వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. రక్త చరిత్ర తరువాత తెలుగు లో సినిమా వాళ్ళ పై సినిమా తీసినా అది అంత సక్సెస్ కాలేదు. తాజాగా ఇప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని బేస్ చేసుకుని సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మహానేతగా పిలవబడుతున్న వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తరువాత రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను, సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్న వారి వైనాన్ని కూడా వర్మ ఈ సినిమాలో చూపించే విధంగా ఈ సినిమా తీయబోతున్నట్లు మీడియా వర్గాల సమాచారం.
అయితే ఈ సినిమా పై ప్రెస్ మీట్ పెట్టిన వర్మ మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జరిగిన పరిణామాలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన స్ర్కిప్టు వర్క్ ని రూపొందించే పనిలో వర్మ బిజీగా ఉన్నాడట. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభించబోతున్నామని తెలిపాడు. అంతే కాకుండా తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని, రాజకీయ నాయకుల మనస్తత్వం తెలుసునన్నారు. ఈ సినిమాని శ్రేయ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని కిరణ్ కుమార్ కోనేరు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం వర్మ ఒక్క రాజశేఖర్ రెడ్డి గురించే కాకుండా మన రాష్ట్ర నాయకుల చరిత్ర గురించి కూడా చెప్పబోతున్నాడని అంటున్నారు. మరి ఈ సినిమా రక్తచరిత్ర లాగా కూల్ గా ఉంటుందో లేక రాజకీయ నాయకుల బండారం బయట పెట్టే విధంగా ఉంటుందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more